Sunday, April 28, 2024

దమ్ముంటే.. గోషామహల్‌లో పోటీ చెయ్యి: రాజాసింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దమ్ముంటే నా మీద నువ్వు పోటీ చెయ్యి ఓవైసీ ? అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. గోషామహల్ లో అభ్యర్థులను నిలబెట్టాలని మజ్లిస్ నేతలను రేవంత్ రెడ్డి అడుగుతున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ లోనే దారుసలెం, ఎంఐఎం ఆఫీస్‌లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పే ధైర్యం ఒవైసీలకు లేదని అన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వ కాళ్ళు పట్టుకొని, ఇల్లీగల్ దందాలు చేసే చరిత్ర ఒవైసీ లది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులను నిలబెట్టి బ్లాక్ మెయిల్ దందాలు చేశారని ఆరోపించారు. ఓవైసీ కుటుంబమే అభివృద్ధి చెందుతోంది తప్ప ముస్లిం వర్గాలు కాదని కీలక వ్యాఖ్యలు చేశారు.

ముస్లింలను ఓట్లు అడగను, వాళ్ళు నాకు ఒట్లేయరు, వాళ్ళ ఓట్లు నాకు అవసరం లేదని అన్నారు. 2014 ఎన్నికల్లో ముకేష్ గౌడ్‌కు మద్దతు ఇచ్చేందుకు ఒవైసీ డబ్బులు తీసుకున్నాడని అన్నారు. 2018 ఎన్నికల్లో బిఅర్‌ఎస్ అభ్యర్థిని దారుసలేం నుంచే డిసైడ్ చేసిండని అన్నారు. 2023 ఈ ఎన్నికల్లో కూడా దారుసలెం నుంచే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు. దారుసలేం కు ఇంకా డబ్బుల సంచులు వెళ్తే అభ్యర్థి ఎంపిక అయిపోతోందన్నారు. ఒక పెద్ద బిజినెస్ మాన్ అసదుద్దీన్ ఓవైసీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే నువ్వు పోటీ చెయ్యి ఓవైసీ నా మీద ? అంటూ ఆయన సవాల్ విసిరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News