Wednesday, May 15, 2024

కాన్సెప్ట్ బేస్డ్ మూవీ

- Advertisement -
- Advertisement -

కంటికి రెప్పలా, అల్లారుముద్దుగా పెంచుకున్న తన ఇద్దరు చెల్లెళ్ళకు జరిగిన తీరని అన్యాయానికి ఓ అన్న విధించిన శిక్ష నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘జాగ్రత్త బిడ్డా‘. కృష్ణ మోహన్‌ను దర్శకుడిగా వెండితెరకు పరిచయం చేస్తూ కె.ఎస్.బి.క్రియేషన్స్, – ఎమ్.ఎమ్.ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై… శ్రీకాంత్ కరణం, ఎమ్.వై.గిరిబాబు సంయుక్తంగా ఈ కాన్సెప్ట్ బేస్డ్ మూవీని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 23న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల కానుంది. మినిమం గ్యారంటీ మూవీస్ ద్వారా డిస్ట్రిబ్యూటర్ ఎమ్.అచ్చిబాబు ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే సీతక్క ‘జాగ్రత్త బిడ్డా‘ ట్రైలర్ విడుదల చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. డి.జె.టిల్లు, బలగం చిత్రాల కోవలో.. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఈ సందేశాత్మక చిత్రం మంచి విజయం సాధించాలని అభిలషించారు. ఈ వేడుకలో తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్నకుమార్, నిర్మాతలు తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డి.ఎస్.రావు, సాయి వెంకట్ లతోపాటు చిత్రబృందం పాల్గొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News