Tuesday, April 30, 2024

టిఎంసిలో చేరిన మరో బిజెపి ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

MLA Soumen Roy joins Trinamool Congress

బెంగాల్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఉప ఎన్నికల తేదీలను ఎన్నికల సంఘం ప్రకటించిన రోజే బిజెపి శాసనసభ్యుడు సౌమన్ రాయ్ అధికార తృణమూల్ కాంగ్రెస్‌లో చేరిపోయారు. కాలియాగంజ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమన్ రాయ్ గతంలో టిఎంసిని వీడి బిజెపిలో చేరగా ఇప్పుడు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. బెంగాల్, ఉత్తర బెంగాల్ అభివృద్ధి కోసం సౌమన్ రాయ్ టిఎంసికి తిరిగి వస్తున్నారని టిఎంసి నాయకుడు పార్థా చటర్జీ విలేకరులకు తెలిపారు. బెంగాల్ సంస్కృతిని, చారిత్రక వైభవాన్ని కాపాడాలన్నదే సౌమన్ ధ్యేయమని ఆయన చెప్పారు. టిఎంసిలో సౌమన్ రాయ్ చేరికతో అసెంబ్లీలో బిజెపి బలం గత నాలుగు వారాల్లో 71కి పడిపోయింది. ఇప్పటివరకు నలుగురు బిజెపి ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి టిఎంసిలో చేరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News