Monday, May 6, 2024

ఆ విషయంపై హరీష్‌రావు మాట్లాడితే తప్పేంటి: దేశపతి

- Advertisement -
- Advertisement -

పివిని కాంగ్రెస్ అధిష్టానం అవమానించింది
సభలో మాజీ మంత్రి హరీష్‌రావు మాట్లాడితే తప్పేంటి: దేశపతి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ బిడ్డ పివి నర్సింహ్మారావుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసిన అన్యాయంపై మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడితే తప్పేముందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ కించపరిచింది అని చెప్పే క్రమంలో పివిని అవమానించిన తీరును హరీష్ రావు సభలో వివరించారన్నారు. పివి నిజమైన కాంగ్రెస్ వాది కాదనడం లేదన్నారు. అయితే కాంగ్రెస్ వాదిగా పివిని కాంగ్రెస్ హై కమాండ్ గుర్తించలేదని ఆరోపించారు. అవమానకర రీతిలో అంత్యక్రియలు జరిగాయని, దివంగత కాంగ్రెస్ పీఎంలకు ఢిల్లీలో స్మారక స్థలాలు ఉన్నాయని, తెలంగాణ బిడ్డ పివి స్మారక స్థలం ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. పివి శతజయంతి వేడుకలు తెలంగాణలో ఘనంగా బిఆర్‌ఎస్ చీప్ కేసీఆర్ నిర్వహించారని, అప్పుడు కాంగ్రెస్ వాళ్లు అడిగారా అని జీవన్ రెడ్డిని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News