Wednesday, May 8, 2024

యాష్కీ… కళ్లుండి చూడలేని కబోది : ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్

- Advertisement -
- Advertisement -

madhu yashki twitter

MLC farooq hussain comments on Madhu Yaskhi

హైదరాబాద్: తెలంగాణ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్న సిఎం కెసిఆర్ ను విమర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఫారూఖ్ మీడియాతో మాట్లాడారు.  తెలంగాణ తన వల్లే వచ్చిందని మధుయాష్కీ బిల్డప్ ఇస్తున్నారని,  నోరును అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. గత ఎన్నికల నుంచి పారిపోయిన వ్యక్తి అని,  బిజెపికి గత ఎన్నికల్లో మధుయాష్కీ అమ్ముడు పోయారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాం లో గౌడ కులస్తులకు అన్యాయం జరిగితే ఎందుకు మాట్లాడలేదన్నారు. కెసిఆర్ హయాంలో కుల వృత్తులకు న్యాయం జరుగుతోందని, నిజామాబాద్ అభివృద్ధి యాష్కీకి కనిపించడం లేదని, కళ్లుండి కూడా చూడలేని కబోధి యాష్కీ అని ఫారూఖ్ హుస్సేన్ మండిపడ్డారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి పార్టీ అని,  రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. యాష్కీ తనకొచ్చిన పదవిని చూసి పిచ్చి మాటాలు మాట్లాడితే ప్రజలు సహించరన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News