Sunday, April 28, 2024

సిఎం కెసిఆర్ సింగరేణి పక్షపాతి :ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సింగరేణి సంస్థకి ప్రక్షపాతి అని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. సిఎం సింగరేణి ఉద్యోగులు, కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించి నిర్వీర్యం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలను సిఎం కెసిఆర్ అడ్డుకున్నారని గుర్తు చేశారు. సింగరేణ సంస్థ లాభాల్లో 32 శాతం వాటాను కార్మికులకు పంచాలని సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బుధవారం టిబిజికెఎస్ సంఘం నాయకులు ఎంఎల్‌సి కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సింగరేణి కార్మికులను సిఎం కెసిఆర్ ఎప్పుడూ మరచిపోబోరని అన్నారు.

అవకాశం ఉన్న ప్రతీసారి కార్మికులకు ప్రయోజనాలు కల్పిస్తున్నారని తెలిపారు. కార్మికులకు అత్యధిక బోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. 2014లో 18 శాతం బోనస్ ఉండగా, 2022 నాటికి 30 శాతానికి పెంచామని గుర్తు చేశారు. ఈ సారి 32 శాతానికి పెరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమానికి, అభివృద్ధికి బిఆర్‌ఎస్ పార్టీ నిరంతరం పాటు పడుతుందని చెప్పారు. తమ పార్టీ అన్ని విధాలుగా కార్మికులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టిబిజికెఎస్ జనరల్ సెక్రెటరీ మిరియాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, టిబిజికెఎస్ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News