- Advertisement -
హైదరాబాద్: సోమవారం ప్రారంభమైన శాసన మండలిలో ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ
కవిత మాట్లాడుతూ.. ”కేంద్రం 15 ఫైనాన్స్ కమిషన్ లో రూ..500 కోట్లు లోటు పెట్టినా.. స్ధానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ అదనంగా మరో రూ.500 కోట్లు కేటాయించారు. ఇంకా కొన్ని లోటు పాట్లు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. కొత్తగా ఏర్పడిన మండలాల్లో ఎంపిపిలకు కార్యాలయాలు లేవు. ఎంపిటిసిలకు కూడా గ్రామపంచాయతీలో కూర్చోడానికి కుర్చీ లేదు, తగిన ప్రాముఖ్యత ఇవ్వాలి. చట్టాన్ని సవరణ చేసి అయినా సరే పాఠశాలలో జెండా ఎగురవేసే అధికారం ఎంపిటిసి, జెడ్పీటీసీలకు కల్పించాలి” అని ఎమ్మెల్సీ కవిత కోరారు.
MLC Kavitha first speech at TS Legislative Council
- Advertisement -