Wednesday, May 8, 2024

గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటిన డిటిసి పాపారావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో డిటిసి, మోటార్ వెహికల్ ఇన్స్ స్పెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డా.కె పాపారావు పాల్గొన్నారు. సోమవారం తన పుట్టినరోజు సందర్భంగా కొండాపూర్ ఆర్టిఓ కార్యాలయంలో ఆయన మొక్కలు నాటారు. తన పుట్టినరోజు సందర్భంగా ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని పాపారావు అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టి విజయవంతంగా ముందుకు తీసుకువెళుతున్న ఎంపి సంతోష్ కుమార్ పై పాపారావు ప్రశంసల జల్లు కురిపించారు.

ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ రాఘవ, డి.టి.సి.ప్రవీణ్ రావు, ఆర్.విజయరావు, సురేందర్ రెడ్డి, సత్యనారాయణ, వాసు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

DTC Paparao plant saplings at Kondapur RTO Office

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News