- Advertisement -
కవితను కలిసిన జగిత్యాల
ఎంఎల్ఎ సంజయ్కు కరోనా
పాజిటివ్తో నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: ఎంఎల్సి కల్వకుంట్ల కవిత హోం క్వారంటైన్లోకి వెళ్లారు. బుధవారం శాసన మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన కవిత హోంక్వారంటైన్కు వెళ్లడంతో ఈ కార్యక్రమం రద్దు అయింది. ఎంఎల్సి కవిత 5రోజులపాటు హోం ఐసోలేషన్లో ఉండనున్నారు. సోమవారం ఎంఎల్సి ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవితను కలిసిన జగిత్యాల శాసనసభ్యుడు డా.సంజయ్ కుమార్కు కరోనా పాజిటివ్గా నిర్దారణ కావడంతో కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఐదురోజుల పాటు పార్టీశ్రేణులు, ప్రజలకు తాను అందుబాటులో ఉండటంలేదని కవిత తెలిపారు.
- Advertisement -