Saturday, April 27, 2024

తెలుగు రాష్ట్రాల మధ్యన రెండో వందేభారత్ రైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్యన రెండో వందేభారత్ రైలు ప్రారంభం కానుంది. ఏప్రిల్ 8తేదీన సికింద్రాబాద్ నుంచి వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్-తిరుపతి మధ్యన వందేభారత్ రైలు నడవనుంది. ఎనిమిదిన్నర గంటల్లో రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి చేరుకోనున్నట్లు సమాచారం. ప్రారంభోత్సవం రోజున నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, పిడుగురాళ్లు, తెనాలి, బాపట్ల, చీరాల, గూడూరు స్టేషన్లలో వందేభారత్ రైలు ఆగనుంది. స్టేషన్లలో స్థానిక ప్రజలు స్వాగతం తెలపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News