Monday, May 20, 2024

బాలికపై సామూహిక అత్యాచారం….

- Advertisement -
- Advertisement -

Mother's colleagues rape on girl in Odisha

భువనేశ్వర్: 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బాలిక తల్లి ప్రముఖ టివి ఛానెల్‌లో పని చేస్తోంది. ఇన్ఫోసిటి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో ఓ అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. తల్లి ఆఫీస్‌కు వెళ్లినప్పుడు ఆమె సహోద్యుగులు బాలికపై అత్యాచారం చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. అంతేకాకుండా సదరు బాలికపై పోలీస్ అధికారి, ఇద్దరు ప్రైవేటు సెక్యూరిటీ గార్డులు, మరో ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. కొన్ని రోజుల తరువాత జరిగిన ఘోరాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో ఆమె తన సహచర ఉద్యోగులను నిలదీసింది. వాళ్లు చంపేస్తామని తల్లీకూతళ్లను బెదిరించడంతో సొంతూరుకు వెళ్లిపోయారు. బాలిక తల్లి దైర్యం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News