- Advertisement -
కోల్ కతా: పశ్చిమ బెంగాల్లోని కమర్హతి గోలఘాట్ ప్రాంతంలో ఒక ఇంట్లో బాంబు పేలుడు సంభవించడంతో ఇద్దరు దుర్మరణం చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని స్థానిక సాగర్ దత్తా మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. మృతులు సాజిద్, రాజాగా గుర్తించినట్లు కమర్హతి పోలీసులు తెలిపారు. పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -