Sunday, April 28, 2024

క్రీడల్లో ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు

- Advertisement -
- Advertisement -

Mouma Das and six Other Sportspersons Awarded Padma Shri

 

న్యూఢిల్లీ: క్రీడల్లో ఏడుగురికి ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు వరించింది. వెటరన్ టిటి క్రీడాకారిణి మోమా దాస్ (బెంగాల్)తో పాటు రెజ్లర్ వీరేందర్ సింగ్ (హర్యానా) తదితరులకు పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ప్రముఖ అథ్లెటిక్ కోచ్ ఓ.ఎం. నంబియార్ (కేరళ)కు కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. వీరితో పాటు సుధా హరి నారాయణ్ సింగ్ (ఉత్తరప్రదేశ్), కర్నాటకకు చెందినా పారా అథ్లెట్ కె.వై.వెంకటేశ్, తమిళనాడుకు చెందిన పి.అనిత, అన్షు జెమ్సెన్పా (అరుణాచల్ ప్రదేశ్)లకు పద్మశ్రీ అవార్డులు లభించాయి. సోమవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రతి ఏడాది జనవరిలో ఈ అవార్డులను ప్రకటించడం అనవాయితీగా వస్తోంది. ఈసారి క్రీడల్లో ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News