Sunday, April 28, 2024

ఎర్రవల్లిలో సిల్వర్ ఓక్ మొక్కలను నాటిన ఎంపి సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్.. ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో సిల్వర్ ఓక్ మొక్కలను నాటారు. పర్యావరణ రక్షణతో పాటు, మొక్కలు నాటడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకునేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఎంపీ సంతోష్ తెలిపారు. పుట్టిన రోజుతో పాటు, సందర్భం ఏదైనా మొక్కలు నాటే సంప్రదాయం ప్రతీ ఒక్కరూ కొనసాగించాలని ఆయన కోరారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News