Saturday, May 18, 2024

కెసిఆర్‌కు ఉన్న ధైర్యం ఎవరికి లేదు

- Advertisement -
- Advertisement -

MP santhosh kumar

 

మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్‌కు ఉన్న ధైర్యం దేశంలో మరెవరికి లేదని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడుకోవాలంటే లాక్‌డౌన్ కాలాన్ని మరింత గడువు పొడగించడమే మంచిదని ప్రధాని నరేంద్రమోడీకి సిఎం కెసిఆర్ కోరడం నిజంగా అభినందనీయమని వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ కారణంగా ఆర్ధికంగా దేశానికి, రాష్ట్రానికి నష్టం వాటిల్లినా దానిని భవిష్యత్తుల్లో పూడ్చుకోవచ్చునన్నారు. కాని ప్రజల ప్రాణాలు పోతే తిరిగి తెచ్చివ్వలేమని, ఆ నష్టాన్ని ఎన్ని డబ్బులిచ్చినా పూడ్చలేనిదని పేర్కొంటూ సంతోష్‌కుమర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

MP santhosh kumar said about KCR
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News