- Advertisement -
హైదరాబాద్: కరోనా నియంత్రణ కోసం విశ్రాంతి లేకుండా పనిచేసున్న 95,392 మంది పారిశుద్ధ్యకార్మికుల జీతంలో కోతను ఉపసంహరించి రూ.5వేలు ముఖ్యమంత్రి ప్రోత్సాహం కింద ఇవ్వనున్నట్లు ప్రకటించిన సిఎం కెసిఆర్కు రాష్ట్ర మున్సిపాలిటీ, ఐటి, పరిశ్రమల శాఖమంత్రి కెటిఆర్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిహెచ్ఎంసి,హెచ్ఎండబ్లూఎస్ కార్యకర్తలకు రూ. 7,500 ప్రోత్సాహాన్ని ప్రకటించిన సిఎం కెసిఆర్కు ధన్యవాదాలు తెలిపారు. కరోనా నియంత్రణలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను కెటిఆర్ ప్రశంసించారు. కరోనాకు వ్యతిరేకంగా ప్రజలంతా లాక్డౌన్లో ఉండి ఇళ్లకే పరిమితం కావాలని కెటిఆర్ మరోసారి విజ్ఞప్తి చేశారు.
Cash incentives for sanitation workers
- Advertisement -