Tuesday, April 30, 2024

ఎన్నికల నియమావళిపై అవగాహన కలిగి ఉండాలి

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: ఎన్నికల నియమావళి, ప్రవర్తనపై ప్రతీ పోలీస్ అధికారి అవగాహన పెంచుకుని రానున్న ఎన్నికలకు సిద్ధ్దంగా ఉండాలని జిల్లా ఎస్‌పి ఎగ్గడి భాస్కర్ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సమయంలో పోలీస్ శాఖ తీసుకోవాల్సిన చర్యలు, జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ఎస్‌పి పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్‌పి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల నియమావళి, ప్రవర్తనపై ప్రతీ పోలీస్ అధికారి అవగాహన పెంచుకుని ఏ సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా ముందుకు సాగాలన్నారు.

జిల్లాలో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో సమస్యాత్మకమైనవి ఎన్ని, సాధారణమైనవి ఎన్ని అనేవి గుర్తించి ఎలాంటి సమస్యలు లేకుండా రెవె న్యూ అధికారులతో కలిసి ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి వాటి స్థితిగతులు, భౌగోళిక పరిస్థితుల గురించి తెలుపాలన్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ వర్కుపై దృష్టి సారించాలని, విఐపి, వివిఐపిలు, వచ్చి పోయే సమయాల్లో అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలన్నారు.

చట్ట వ్యతిరేక కార్యక్రమాలైన గంజాయి, పేకాట, గుడుంబా వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి వాటి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో అనువుగా ఉన్న పోలీస్ స్టేషన్‌లలో నర్సరీలు పెంచేందుకు ఏర్పాట్లు చేయాలని, 5 ఎస్‌లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ పరిశుభ్రంగా ఉంచి ఆహ్లాదకర వాతావరణం ఉండేలా తీర్చిదిద్దాలన్నారు. గత ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద కేసులు నమోదైన వ్యక్తులు, భూ తగాదాలు, పాత కక్షల కేసుల్లో నేరస్తులను, నేర స్వభావం కలిగిన వ్యక్తులను పోలీస్ స్టేషన్‌ల వారీగా గుర్తించి బైండోవర్ చేయాలని సూచించారు.

రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలన్నారు. హైవేలపై జరిగే యాక్సిడెంట్‌లకు సంబంధించి ఫస్టు రెస్పాండర్స్‌గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంక్‌లు, దాబాల్లో పనిచేసే వారికి, యూత్‌కు గ్రామస్తులకు ఫస్ట్ ఎయిడ్, సిపిఆర్‌ఐ అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రదేశాలను గుర్తించి పిఆర్, ఆర్‌అండ్‌బి శాఖల సమన్వయంతో ప్రమాదాలను నివారించేందకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిఎస్‌పిలు ప్రకాష్, రవీందర్‌రెడ్డి, రవీంద్రకుమార్, సిఐలు నటేష్, లక్ష్మీనారాయణ, ఆరిఫ్ అలీఖాన్, కోటేశ్వర్, ప్రవీణ్‌కుమార్, రమణమూర్తి, ఎస్‌ఐలు, డిసిఆర్‌బి, ఐటికోర్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News