Tuesday, April 30, 2024

వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా ఎన్. బాలమల్లేష్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్ ఖేత్ మజ్దూర్ యూనియన్ (బికెఎంయు) 15వ జాతీయ మహాసఢలు నవంబర్ 2 నుంచి 5 వరకు బీహార్ రాష్ట్ర రాజధాని పాట్నా నగరంలో జరిగాయి. ఈ మహాసభలలో తెలంగాణ రాష్ట్రంకు చెందిన ఎన్.బాలమల్లేష్ యాదవ్ జాతీయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఎన్.బాలమల్లేష్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డి జిల్లా సిపిఐ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనేక విద్యార్థి, యువజనోద్యమాలకు నాయకత్వం వహించారు. విద్యార్థి నాయకుడిగా క్యూబాలో పర్యటించారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శిగా ఎన్నుకొన్న జాతీయ నాయకత్వంకు ఎన్.బాలమల్లేష్ అఢినందనలు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News