Sunday, April 28, 2024

మింత్రా సిఇఓగా నందితా సిన్హా

- Advertisement -
- Advertisement -

Nandita Sinha to take over as Myntra CEO

ముంబయి: ఫ్లిప్‌కార్ట్ అనుబంధ ఫ్యాషన్ ఇ టైలర్ సంస్థ మింత్రా సిఇఓగా నందితా సిన్హా నియమితులయ్యారు. ఆమె నియామకం వచ్చే జనవరినుంచి అమలులోకి వస్తుంది. ఇంతకు ముందు నందితా సిన్హా ఫ్లిప్‌కార్ట్ కన్జూమర్ గ్రోత్ అండ్ మార్కెటింగ్ విభాగం ఉపాధ్యక్షురాలుగా పని చేశారు.2013లో ఆమె ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. నాటినుంచి వివిధ విభాగాల్లో బహుముఖ పాత్రలు పోషించారు. బ్యూటీ అండ్ ఫ్యాషన్ కేర్, బుక్స్ అండ్ జనరల్ మర్చండైజ్, హోం అండ్ ఫర్నీచర్ విభాగాల్లో పని చేశారు.ఇంతకు ముందు మింత్రా సిఇఓగా పని చేసిన అమర్ నాగారం గత నెల 23న తన పదవికి రాజీనామా చేశారు. సొంత వెంచర్ పనులు చేపట్టేందుకు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే తన తర్వాత సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగేందుకు డిసెంబర్ వరకు మింత్రా సిఇఓగా కొనసాగుతారు. తర్వాత సలహాదారుగా వ్యవహరిస్తానని తెలిపారు. ఈ విషయాన్ని మింత్రా వర్గాలు సైతం ధ్రువీకరించాయి. మూడేళ్ల క్రితం అమర్ నాగారం మింత్రా సిఇఓగా బాధ్యతలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News