- Advertisement -
హైదరాబాద్ : జాతీయ రైతుల దినోత్సవ సందర్భంగా అన్నదాతలకు మంత్రి కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్వితీయ ప్రగతి సాధించిందని తెలిపారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో రికార్డులు తిరగరాసిందని స్పష్టం చేశారు. కాని కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ మన రైతన్నలకు ఇబ్బందులకు గురిచేస్తోందిన కెటిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో స్పష్టమైన పాలసీ ప్రకటించాలని, రైతన్నలను ఇబ్బందులకు గురిచేయవద్దు అని కేంద్ర బిజెపి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సార్లు విజ్ఞప్తులు చేసిందని గుర్తు చేశారు. రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనేది మా విధానం అని కెటిఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
- Advertisement -