Thursday, May 2, 2024

చత్తీస్‌గఢ్‌లోని ఇనుప గనిపై నక్సలైట్ల దాడి, ఇద్దరి కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

Naxals attack iron ore mine site in Chhattisgarh

 

నారాయణపూర్: చత్తీస్‌గఢ్‌లో సాయుధ నక్సలైట్లు ఓ ఇనుపగని ప్రాంతంపై దాడి చేసి నాలుగు వాహనాలను తగులబెట్టారు. నారాయణపూర్ జిల్లా ఆమ్‌దాయీ ఇనుప గని ప్రాంతంలో శనివారం ఈ ఘటన జరిగింది. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతుండగా నక్సలైట్లు దాడికి పాల్పడ్డారని ఎస్‌పి మోహిత్‌గార్గీ తెలిపారు. నిర్మాణ పనుల్లోని సిబ్బందిలో ఇద్దరిని నక్సలైట్లు అపహరించారని ఆయన తెలిపారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి చేరుకొని గాలిస్తుండగా ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయని గార్గీ తెలిపారు. ఇంకా కొనసాగుతున్నాయన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News