Thursday, May 2, 2024

ఇద్దరిని కాల్చిచంపిన నక్సలైట్లు

- Advertisement -
- Advertisement -

Naxals kill two villagers on suspicion in Balaghat

బైహార్ (మధ్యప్రదేశ్) : పోలీసు ఇన్‌ఫార్మర్లనే అనుమానంలో నక్సలైట్లు గ్రామస్థులిద్దరిని కాల్చిచంపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలోని బైహార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న మలికేడి గ్రామం వద్ద జరిగింది. శనివారం తెల్లవారుజామున నక్సల్స్ ఈ చర్యకు దిగారని స్థానిక పోలీసు అధికారి ఆదిత్యా ప్రతాప్ మిశ్రా తెలిపారు. పోలీసులకు సమాచారం ఇస్తున్నారని నక్సల్స్ గ్రామానికి చెందిన 48 సంవత్సరాల సంతోష్, 45 ఏండ్ల జగదీష్ యాదవ్‌పై కాల్పులు జరిపి చంపివేసినట్లు వివరించారు. ఎవరైనా తమ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు అయితే ఇతరులకూ ఇదే గతి పడుతుందని ఇక్కడ కరపత్రాలను పడేసి నక్సల్స్ వెళ్లినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News