Tuesday, May 7, 2024

నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా…

- Advertisement -
- Advertisement -

గణేష్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘స్వాతిముత్యం’. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్.కె.కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ప్రేమ గీతం సోమవారం విడుదలైంది. నాయిక వర్ష బొల్లమ్మతో ‘నీ చారెడు కళ్లే చదివేస్తూ ఉన్నా… నీ మత్తులో మళ్లీ పడిలేస్తూ ఉన్నా‘ అంటూ పాటందుకున్న నాయకుడు గణేష్ ఈ వీడియో చిత్రంలో కనిపిస్తారు. ఈ గీతానికి సాహిత్యాన్ని కెకె అందించగా, అర్మాన్ మాలిక్, సంజన కాలమంజే శ్రావ్యంగా ఆలపించారు. మహతి స్వర సాగర్ సంగీతంలో కొత్త హొయలు పోయింది ఈ గీతం. గణేష్ మాస్టర్ నిర్దేశకత్వంలో రూపొందిన ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నట్లు తెలిపారు నిర్మాత సూర్య దేవర నాగవంశీ. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రంగా ‘స్వాతిముత్యం’ను దర్శకుడు లక్ష్మణ్ తీర్చిదిద్దారు అని తెలిపారు.

Nee Charedu Kallu Song out from Swathi Muthyam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News