- Advertisement -
హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 472 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,84,863కి చేరింది. ఈ రోజు వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మృతుల సంఖ్య 1,531కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 509 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,76,753కి చేరింది. ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 6,579 ఉండగా వీరిలో 4,424 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
- Advertisement -