Friday, May 10, 2024

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Road Accident in Karnataka five killed

 

కర్ణాటక : రహదారులు రక్తమోడుతున్నాయి. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్సు ఓ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News