Sunday, April 28, 2024

నల్లా మీటర్లకు స్పందన అంతంతే

- Advertisement -
- Advertisement -

No response to fixing of water meters

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో సిఎం కెసిఆర్ ప్రజలకు ఉచితంగా 20వేల లీటర్ల తాగునీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చి సంక్రాంతి పండుగ కానుకగా పథకంగా మున్సిఫల్ శాఖ మంత్రి కెటిఆర్ పథకం ప్రారంభించారు. గృహ యాజమానులు కనెక్షన్‌కు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకుని మీటర్లు బిగించుకోవాలని సూచించి 20వేల లీటర్లకంటే నీరు ఎక్కువ వినియోగిస్తే బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు. మార్చి 31వ తేదీలోగా మీటర్లు పెట్టుకున్నవారే ఈపథకాని వర్తిస్తారని చెప్పారు. కానీ పథకం ప్రారంభించి సుమారు రెండు నెలల గడుస్తున్న మీటర్లు బిగించుకునేందుకు గ్రేటర్ ప్రజలు ముందుకు రావడం రాలేదని జలమండలి ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లబ్దిదారులు పథకానికి డొమెస్టిక్ స్లమ్ వినియోగదారులు 1.96లక్షలు, డొమిస్టిక్ వినియోగదారులు 7.87 లక్షలు, డొమెస్టిక్, ఆపార్టుమెంట్లు, డొమెస్టిక్ బల్క్ 24, 967 మొత్తం 10.08 లక్షల మంది అర్హులు, వీరిలో డొమెస్టిక్ స్లమ్ వినియోగదారుల కనెక్షన్లను మీటర్ రీడర్లు ఇంటింటికి తిరిగి ఆధార్ అనుసంధానం చేశారు. కానీ ఇప్పటివరకు లక్ష మంది ఆధార్ అనుసంధానం కాలేదని డివిజన్ అధికారులు వెల్లడిస్తున్నారు. ఎక్కువ కనెక్షన్లు డొమెస్టిక్ వినియోగదారులవే ఉండగా వాటిలో ఇప్పటివరకు 2. 50లక్షల మంది ఆధార్ అనుసంధానం, మీటర్లు బిగింపుకు ముందుకు వచ్చినట్లు బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఆధార్ అనుసంధానం, మీటర్లు బిగింపుకు గడువు నెల 31వరకు ఉండంతో అప్పటిలోగా పూర్తి కావడం కష్టమేనంటున్నారు. డిసెంబర్ నెల నుంచి బిల్లులు వసూలు చేయడం లేదని, ఈనెలాఖరు లోగా మీటర్లు బిగించకుంటే మరో నెలపాటు గడువు పొడిగించాల్సి వస్తుందని దీంతో బోర్డుకు మరింత భారం పడుతుందని పేర్కొంటున్నారు. నగర ప్రజలు మాత్రం ప్రభుత్వ ఉచితంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు నీరు సరఫరా చేస్తుంది, అపార్టుమెంట్లు యాజమానులకే షరతులు వర్తిస్తాయని భావిస్తూ ఆధార్ అనుసంధానం, మీటర్ల బిగింపు ముందుకు రావడంలేదని లైన్‌మెన్లు చెబుతున్నారు. తాము ఎంత చెప్పిన పట్టించుకోవడం, బిల్లులు వస్తే అప్పడు చూస్తామని నిర్లక్షంగా సమాధానం ఇస్తున్నట్లు వివరిస్తున్నారు. జలమండలి ప్రతి డివిజన్‌కు 2 ఏజెన్సీల చొప్పన 15ఎంఎం, 20ఎంఎం సైజు మెకానికల్ మీటర్ల సరఫరా, మీటర్ బిగింపు కోసం 24 ఏజెన్సీలు బాధ్యతలు అప్పగించి మీటర్లను అందుబాటులో ఉంచింది.

మీటర్ ధర, బిగింపు ఇతర ఖర్చులు…

మీటర్‌సైజు మీటర్ ధర 18శాతంజీఎస్టీ బిగింపుధర మొత్తం
15ఎంఎం రూ.1100 రూ.198 రూ.200 రూ.1498
20ఎంఎం రూ.1650 రూ.297 రూ.200 రూ.2147

జలమండలి సూచించిన విధంగా సకాలంలో మీటర్లు బిగించుకుని ఉచిత నీరు పొందాలని, ఆలస్యం చేస్తే పథకంలో అర్హులుగా పొందలేరని బోర్డు ఉన్నతాధికారులు చెబుతున్నారు. డొమెస్టిక్ వినియోగదారులు బహుళ అంతస్తుల భవనం, బల్క్ కనెక్షన్ దారులు డిసెంబర్ 1వ తేదీ 2020 నాటికి పంక్షనల్ మీటర్లతో ఉండి,వారు తమ ఆధార్ అనుసంధానం ప్రక్రియను ఏప్రిల్ 1, 2021లోపు పూర్తి చేసిన వారికి ఒకేసారి 4నెలలకుగాను దానికి సంబంధించిన బిల్లులు జారీ చేస్తామని, ప్రతినెల 20వేల లీటర్ల లోపు వాడిని వినియోగదారులు బిల్లులు చెల్లించాల్సిన అవసరంలేదు. నీటి వినియోగం నెలకు 20వేల లీటర్లకు మించితే అదనపు వినియోగానికి బోర్డు టారిప్ ప్రకారం బిల్లు చెల్లించాలని బోర్డు ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. డొమెస్టిక్ స్లమ్ కనెక్షన్లకు ఆధార్ ప్రక్రియను పూర్తి చేసేందుకు 165మంది మీటర్ రీడర్లను నియమించినట్లు, మిగతా కేటగిరీల వారు స్వయంగా చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News