Saturday, May 4, 2024

బిజెపి వాళ్లను బెదిరిస్తూ బిఆర్‌ఎస్ కండువా కప్పడం సరికాదు

- Advertisement -
- Advertisement -

సారంగాపూర్ :బిజెపి నాయకులను భయబ్రాంతులకు గురి చేస్తూ బిఆర్‌ఎస్ కండువా కప్పడం సరైందని కాదని నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, బిజెపి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం సారంగాపూర్ మండలంలోని కంకెట గ్రామ ఎంపిటిసి లక్ష్మణ్‌ను ప్రలోభాలకు , భయబ్రాంతులకు గురి చేసి బి ఆర్‌ఎస్ పార్టీ నాయకులు గులాబి కండువ కప్పడం సిగ్గు చేటు అన్నారు. ఎం పిటిసి లక్ష్మణ్ నేడు తిరిగి మళ్లీ సొంత గూటికి చేరారన్నారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు కరిపే విలాస్, నాయకులు రాం శంకర్ రెడ్డి, సాహెబ్ రావు, భూమయ్య, రంజిత్ , అయిండ్ల మధు, సుంకరి శ్రీ కాంత్, నర్సింగ్ రావు, తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News