Thursday, May 2, 2024

సిఎం పదవి కాదు.. సింగిల్ డిజిట్ తెచ్చుకో

- Advertisement -
- Advertisement -
అమిత్‌షా అబద్ధపు విమర్శలు.. అవుట్ డేటెడ్ ఆరోపణలు

ఢిల్లీలో రైతులను అణిచివేసిన మీరా రైతు బాంధవుడు కెసిఆర్‌ను విమర్శించేది
బ్యాటు పట్టడం చేతకాని మీ కొడుక్కి బిసిసిఐలో కీలక పదవి ఎలా వరించింది?
తెలంగాణలో బిజెపికి ఎప్పుడో నూకలు చెల్లు
-మంత్రి హరీశ్‌రావు ఫైర్

మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర మం త్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ఖమ్మం సభ లో సిఎం కెసిఆర్, బిఆర్‌ఎస్ ప్రభుత్వంపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. పదవి కాదు, ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తె చ్చుకునే ప్రయత్నం చేయాలని విమర్శించారు. మాకు నూకలు చెల్లడం కాదు, తెలంగాణ ప్రజ లు నూకలు తినాలని మీ మంత్రి పీయూష్ గోయ ల్ వెక్కిరించినప్పుడే బిజెపికి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయన్నారు. బ్యాట్ సరిగ్గా పట్టడం చేత కాని మీ అబ్బాయిని ఏకంగా బిసిసిఐలో కీలక పదవి ఎలా వరించిందో అందరికీ తెలుసని అమిత్ షాను ఉద్దేశించి అన్నారు.

అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పెద్ద ఎత్తున రైతులు ఉద్యమిస్తే కార్పొరేట్ కొమ్ముకాసే చట్టాలను ఉపస ంహరించుకునితోకముడిచిన మీరా,రైతు బాంధవుడైన కేసీఆర్‌ను విమర్శిం చేదని మండిపడ్డారు.2జి, 3జి, 4జి కాదు, కేంద్రంలో దశాబ్ద కాలంగా నా జీలను మించిన నియంతృత్వ పాలన మీదని అన్నారు. సిఎం పదవి కాదు.. ముందు తెలంగాణలో సింగిల్ డిజిట్ తెచ్చుకునేందుకు ప్రయత్నించండని మంత్రి హరీశ్‌రావు అన్నారు. అబద్ధపు విమర్శలు, అవుట్‌డేటేడ్ ఆరోపణ లు, రాసిచ్చిన స్క్రిప్ట్‌తో హోంమంత్రి స్కిట్ చేసి వెళ్లారని ఎద్దేవా చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News