Tuesday, April 30, 2024

ధూమపానం వద్దన్నందుకు… ప్రాణాలు వదిలాడు

- Advertisement -
- Advertisement -

 

చెన్నై: సిగరెట్ తాగడం మానుకోవాలని భార్య మందలించినందుకు భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శాలిగ్రామం మదియళగణ్‌కు చెందిన నరసింహన్ (72) తమిళనాడు ప్రభుత్వ రవాణా వ్యవస్థలో డ్రైవర్‌గా పని చేసి రిటైర్డయ్యాడు. నరసింహన్ ఎప్పుడు పొగతాగుతుండడంతో… మానుకోవాలని భర్తను పలుమార్లు భార్య మందలించింది. దీంతో భార్య భర్తల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. బుధవారం రాత్రి  నరసింహన్ టాయ్‌లెట్ యాసిడ్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

One Person dead with without smoke in Tamil nadu

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News