- Advertisement -
లండన్: మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19) సోకి పరిస్థితి విషమించడంతో గత కొన్ని రోజులుగా లండన్లో సెయింట్ థామస్ ఆస్పత్రిలోని ఐసియులో చికిత్స పొందుతున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఆరోగ్యం కొంత మెరుగుపడడంతో ఐసియు నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం బోరిస్ సాధారణ వార్డులో చికిత్స పొందుతున్నట్లు 10-డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయం తెలిపింది. ప్రధాని బోరిస్ జాన్సన్ కరోనా నుంచి కోలుకుంటున్నారని, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొంది. మార్చి 27వ తేదీ నుచి సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిన జాన్సన్ కు ఆదివారం కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాజిటివ్ అని తెలింది.
British PM Boris Johnson leaves ICU Treatment
- Advertisement -