Wednesday, May 15, 2024

గడ్డి మందు తాగి ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: గడ్డిమందు తాగి ఒకరు మృతిచెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నల్లబెల్లి మండలం కొండాయిపల్లి గ్రామానికి చెందిన ఎద్దు కుమార్(45) వ్యవసాయం చేస్తుండేవాడు. కాగా గత కొంత కాలం నుంచి మద్యానికి బానిసై అనారోగ్యానికి గురై ఏ పనిచేయక ఇంటి వద్దనే ఉంటున్న క్రమంలో జీవితంపై విరక్తి చెంది గురువారం తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో ఇంట్లోని గడ్డి మందు తాగి ఇంటి ముందు వాంతులు చేస్తుండగా వెంటనే ఎంజీఎంకు తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుని భార్య ఎద్దు సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నగేష్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News