Sunday, May 5, 2024

వైభవంగా ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: శ్రీలక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవాన్ని ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేకం, సాయంత్రం ఆలయ మండపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని నిర్వహించారు.

అమ్మవారిని ప్ర త్యేక అలంకరణ చేసిన అర్చకులు మేళతాళాలు, మంత్రోచ్ఛరణ గావిస్తూ అమ్మవారి సేవను ఆలయ పురవీధులలో ఊరేగించారు. అద్దాల మండపంలో అమ్మవారి సేవను వేచింప చేసి ఊంజల్ సేవ ప్రత్యేకతను అర్చకులు భక్తులకు వివరించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకొని తరించారు.

శ్రీవారి నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శుక్రవారం రూ.9,40,285 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ.39,500, బ్రేక్ దర్శనం ద్వారా రూ.29,100, వ్రత పూజల ద్వారా రూ.17,600, వీఐపీ దర్శనాల ద్వారా రూ.15,000, కొండపైకి వాహనాల ప్రవేశం ద్వారా రూ.1,00,000, ప్రసాద విక్రయం ద్వారా రూ.3,75,530, తదితర శాఖల నుంచి ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

ఆండాళ్ అమ్మవారికి వెండి కవచం బహూకరణ..
పాతగుట్ట ఆండాళ్ అమ్మవారికి భక్తులు వెండి కవచమును బహుకరించారు. శుక్రవారం సికింద్రాబాద్‌కు చెందిన శేరుపల్లి జ్యువెలర్స్ దంపతులు శ్రీనివాస్ రజిత శ్రీఆండాల్ అమ్మవారికి 2 కిలోల 34 గ్రాముల వెండి కవచాన్ని, 499 గ్రాముల వెండి గడపను ఆలయ ఈవో గీతకు సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News