- Advertisement -
ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్లో అసాధారణ ఆటతో ప్రకంపనలు సృష్టిస్తున్న స్టార్ షట్లర్, తెలుగు రాష్ట్రాల ముద్దుబిడ్డ పి.వి.సింధుకు ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డును ప్రకటించారు. కిందటి ఏడాది ప్రపంచ బ్మాడ్మింటన్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించి సింధు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. భారత క్రీడా చరిత్రలోనే ప్రపంచ బ్యాడ్మింటన్లో పసిడి పతకం గెలిచిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా సింధు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతేగాక ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్స్లో రజత పతకాన్ని సాధించి భారత ఖ్యాతిని ఇనుమడింప చేసింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్తో సత్కరించాలని నిర్ణయించింది. కాగా, మహిళల హాకీలో అద్భుతంగా రాణిస్తున్న భారత కెప్టెన్ రాణి రాంపాల్కు పద్మశ్రీ అవార్డు దక్కింది.
Padma Bhushan Award for PV Sindhu
- Advertisement -