సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. చేగుంట మండలంలో టిఆర్ఎస్ పార్టీకి మద్దతుగా రైతులు, మహిళల భారీ ప్రదర్శన చేపట్టారు. టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎంఎల్ఎ మదన్ రెడ్డి, పద్మాదేవేందర్ రెడ్డితోె పాటు పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ”సోలిపేట సుజాత అక్కకు మద్దతుగా ఊరూ వాడ కదులుతున్నయి. తెలంగాణ కోసం రాజీనామా చేసింది మేము. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి మేనమామ మాదిరిగా సిఎం కెసిఆర్ రూ. లక్షా 116 ఇస్తున్నారు. ఆడబిడ్డల కష్టపడవద్దని ఇంటింటికీ నల్లా పెట్టి మంచినీళ్లు ఇస్తున్నాం. ఆడబిడ్డ కన్నీళ్లను అవహేళన చేస్తున్న రఘునందన్ రావు చెత్తబుట్టలో కలిసిపోతాడు” అని పద్మాదేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Padma Devender Reddy Election Campaign in Dubbaka