Tuesday, April 30, 2024

జనసైనికుల బీమా కోసం పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కోటి రూపాయల విరాళాన్ని అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో కోటి రూపాయల చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటి చైర్మన్ నాదేండ్ల మనోహర్, కోశాధికారి ఎవి రత్నంలకు అందజేశారు.

పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు, వారికి ప్రమాద బీమా చేయించేందుకు గత రెండు సంవత్సరాలుగా ఏటా కోటి రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ అందజేస్తున్నారు. మూడో సంవత్సరం కూడా తన వంతుగా రూ.కోటి విరాళాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాలుపంచుకుంటున్న పార్టీ వాలంటీర్లను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జనసైనికులు ఇదే స్పూర్తిని కొనసాగించాలని ఆకాక్షించారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News