Sunday, April 28, 2024

మళ్లీ పెరిగిన పెట్రోలు, డీజిల్ ధరలు

- Advertisement -
- Advertisement -

Petrol And Diesel Prices Increased In India

న్యూఢిల్లీ: ఒక రోజు విరామం తరువాత మళ్లీ ఆదివారం నాడు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. ఈనెలలో ఈ ధరలు పెరగడం ఇది తొమ్మిదోసారి. పెట్రోల్ లీటరుకు 24 పైసలు, డీజిల్ లీటరుకు 27 పైసల వంతున ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో ధరలు లీటరు పెట్రోల్ రూ.92.58, డీజిల్ రూ.83.22 కు చేరాయి. ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని పలు నగరాల్లో పెట్రోల్ లీటరు ధర రూ.100 దాటింది. ఇప్పుడు మరింత పెంచడంతో ముంబైలో పెట్రోలు ధర రూ.100కు చేరువైంది. ప్రధాన నగరాల్లో ముంబైలో పెట్రోలు రూ.98.88,డీజిల్ రూ.90.40, కోల్‌కతాలో పెట్రోలు రూ.92.67,డీజిల్ రూ.86.96, చెన్నైలో పెట్రోలు రూ.94.31, డీజిల్ రూ. 88.07, నొయిడాలో పెట్రోల్ రూ.90.45, డీజిల్ రూ.83.68, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 96.22, డీజిల్ రూ.90.73, జైపూర్‌లో పెట్రోల్ రూ. 94.79,డీజిల్ రూ.91.54, పాట్నాలో పెట్రోల్ రూ.94.79, డీజిల్ 88.46, బెంగళూరులో పెట్రోలు రూ.95.33, డీజిల్ రూ.87.92 వరకు ధరలు ఉన్నాయి.

Petrol and Diesel price hiked again

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News