Tuesday, April 30, 2024

పర్యాటక ఆకర్షణగా ప్రధాని కటౌట్

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : శ్రీనగర్ లాల్‌చౌక్ ప్రాంతం ఘంటా ఘర్ వద్ద ప్రధాని మోడీ నిలువెత్తు కటౌట్ అత్యంత పర్యాటక ఆకర్షణగా మారింది. టూరిస్టులతోపాటు స్థానికులు కూడా ఆ కటౌట్ వద్ద నిల్చుని ఫోటోలు, సెల్ఫీలు తీసుకోడానికి పోటీ పడుతున్నారు. గతంలో తాను వచ్చి చూసిన నాటికి, ఇప్పటికీ ఎంతో చెప్పుకోదగిన మార్పువచ్చిందని కర్నాటకకు చెందిన పర్యాటకులు దినేష్ తన అనుభూతి వివరించారు.

ప్రధాని నిలువెత్తు ఫోటో ఎంతో ఆకర్షణీయంగా ఉందన్నారు. రోడ్లు, సొరంగాలు, తదితర అభివృద్ధి బాగా కనిపిస్తోందన్నారు. యువడాక్టర్ ఒక వయోవృద్ధునికి వైద్య చికిత్స చేస్తున్నట్టు కనిపించే హోర్డింగ్ ముందు ప్రధాని మోడీ కటౌట్ అలంకరించడం ప్రత్యేక ఆకర్షణగా తయారైంది. వృద్ధులను గౌరవించాలన్న ధ్యేయం ఈ హోర్డింగ్ చాటి చెబుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News