న్యూఢిల్లీ: భారత్ లో తయారీ నుంచి కార్మిక రంగం వరకు అనేక సంస్కరణలు తెచ్చామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అసోచాయ్ ఫౌండేషన్ వీక్ 2020 సదస్సులో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంస్కరణల ఫలితంగా దేశంలోకి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయన్నారు. ఒకప్పుడు భారత్ లో ఎందుకు పెట్టుబడులు పెట్టాలని ఆలోచించేవారు. ఇప్పుడు భారత్ లో ఎందుకు పెట్టుబడి పెట్టకూడదని ఆలోచించే పరిస్థితి వచ్చిందని ప్రధాని పేర్కొన్నారు. కొత్త సాగు సంస్కరణల ఫలితాలు రైతులకు అందుతున్నాయని సూచించారు. ఆత్మనిర్మల్ భారత్ ద్వారా దేశ తన అవసరాలు తీర్చుకుంటుందన్నారు. త్వరలో ప్రపంచంలో మరో పారిశ్రామిక విప్లవం వస్తుందన్న ప్రధాని రాబోయే పారిశ్రామిక విప్లవంలో భారత్ ప్రముఖపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. పరిశోధన-అభివృద్ధి విభాగంలో ప్రైవేటు సంస్థల పెట్టుబడులు పెరగాలని పిఎం తెలిపారు.
PM Modi At Assocham Foundation Week 2020