Tuesday, April 30, 2024

డిటోనేటర్… ముఠాను పట్టుకున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

Police captured Gun powder

 

హైదరాబాద్: ఫలక్‌నుమా వట్టేపల్లిలో సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. బండరాళ్లు పేల్చేందుకు ఉపయోగించే గన్‌పౌడర్ స్వాధీనం చేసుకున్నామని టాస్క్‌ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు. వట్టేపల్లిలో గన్ పౌడర్‌తో డిటోనేటర్ తయారీ చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. అమ్మోనియం నైట్రేట్, సోడియం సల్ఫేట్ ద్వారా గన్ పౌడర్ తయారు చేశారు. గన్ పౌడర్‌ను జాంబాగ్‌లోని ఓ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా కరీంనగర్‌కు రవాణా చేస్తామని నిందితుడు షబ్బీర్ తెలిపాడు. షబ్బీర్ అనే వ్యక్తి నుంచి గన్‌పౌడర్‌ను స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు విచారణ నిమిత్తం షబ్బీర్‌ను పోలీసులకు అప్పగించారు. మ.3 గంటలకు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెడుతామని సిసి అంజనీ కుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News