Tuesday, May 7, 2024

మల్కాజ్ గిరిలో కిడ్నాప్‌కు గురైన బాలుడు క్షేమం…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలో బాలుడు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. నిన్న మౌలాలీ సప్తగిరి కాలనీలో 13 ఏళ్ల బాలుడు హర్షవర్ధన్ కిడ్నాప్ అయ్యాడు. నలుగురు వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లారు. విషయం తెలసుకున్న కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బాలుడిని కారులో ఎత్తుకెళ్లిన కిడ్నాప్ ముఠాను శనివారం అరెస్ట్ చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని ఎందుకు కిడ్నాప్ చేశారనే కోణంలో విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News