Tuesday, April 30, 2024

రేపు పాలిసెట్ ఫలితాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో మూడు సంవత్సరాల డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిసెట్ ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి.ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాధ్ ఒక ప్రకటన విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్య కార్యాలయంలో ఉదయం 1 గంటలకు సాంకేతిక విద్య కమిషనర్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ నెల 17వ తేదీన నిర్వహించిన పాలిసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 98,273 మంది(92.94 శాతం) విద్యార్థులు హాజరయ్యారు. ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతోపాటు వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో పాలిసెట్ ద్వారా ప్రవేశాలను చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News