Saturday, May 4, 2024

పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. గుంటూరులోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే ఈ నాటకోత్సవాల ప్రారంభ సభలో ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్, సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత నంది అవార్డుల్లో తనకు అన్యాయం జరిగిందన్నారాయన. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తనకు 15 అవార్డులైనా రావాలనీ, కానీ ఒకే ఒక్క అవార్డు ఇచ్చారనీ, అది కూడా ఆ తర్వాత కేన్సిల్ అయిందనీ పోసాని చెప్పారు.

కాగా ప్రస్తుతం నంది నాటకోత్సవాలను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 27మంది సభ్యులతో జ్యూరీ కమిటీని వేశామని, ఎలాంటి అవకతవకలకు తావు ఉండదన్నారు. ఒక్క అనర్హుడికి కూడా అవార్డు రాదని, అర్హులకే అవార్డులని పోసాని చెప్పారు. ఎందుకంటే కళాకారులే జడ్జీలుగా ఉన్నారని వివరించారు. కాగా నాటకోత్సవాల సిడిని మంత్రి చెల్లుబోయిన వేణు ప్రారంభించారు.

నంది నాటకోత్సవాలలో 73 అవార్డులకోసం 38 నాటక సమాజాలకు చెందిన 1200 మంది కళాకారులు పోటీ పడుతున్నారు. ఉత్తమ నాటకాలకు స్వర్ణ, రజత, కాంస్య నందులను బహూకరిస్తారు. ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి రాత్రి 10 గంటల వరకూ రోజుకు ఐదు విభాగాల్లో ఐదు ప్రదర్శనలు ఉంటాయి. ప్రవేశం ఉచితమే. నాటకోత్సవాలు 29వ తేదీ వరకూ జరుగుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News