Friday, May 10, 2024

టీమిండియాలో ప్రసిద్ధ్ కృష్ణ

- Advertisement -
- Advertisement -

Prasidh Krishna got a place in Team India

 

లండన్: ఇంగ్లండ్‌తో జరిగే మిగిలిన రెండు టెస్టుల కోసం యువ ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణకు టీమిండియాలో చోటు దక్కింది. ప్రస్తుతం ప్రసిద్ధ్ స్టాండ్‌బై క్రికెటర్‌గా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాడు. ఇక అతన్ని చివరి రెండు టెస్టుల కోసం జట్టులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బిసిసిఐకి చెందిన ఒక అధికారికి బుధవారం అధికారికంగా వెల్లడించారు. ఇక గురువారం నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణను ఆడించినా ఆశ్చర్యం లేదు. ఇషాంత్ శర్మ, సిరాజ్‌ల స్థానంలో అతనికి చోటు కల్పించే అవకాశం ఉంది. రొటేషన్ పద్ధతిలో కొంతమంది కీలక బౌలర్లకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నట్టు వివరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News