Saturday, April 27, 2024

థర్డ్ ఫ్రంట్‌కు సన్నాహాలు..

- Advertisement -
- Advertisement -

Preparations for the Third Front

 

న్యూఢిల్లీ : థర్డ్ ఫ్రంట్‌కు సన్నాహాలు ప్రారంభమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. మాజీ ఉపప్రధాని దేవీలాల్ జన్మదిన వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 25 న నిర్వహించనున్న సమ్మాన్ సమరోహ్ వేదిక పైకి ప్రముఖనేతలందర్నీ తీసుకొచ్చేందుకు ఐఎన్‌ఎల్‌డి అధినేత ఓం ప్రకాష్ చౌతాలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఎస్‌పి అధినేత మూలాయం సింగ్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి, జెడియు అధినేత నితీస్‌కుమార్, మాజీ ప్రధాని దేవెగౌడ, ఎస్‌ఎడి అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ ఆనాడు భేటీ కానున్నారు. హర్యానా జింద్ సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్, టిఎంసి అధినేత్రి , పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్సు నేత ఫరూక్ అబ్దుల్లా, ఆర్‌ఎల్‌డి నేత జయంత్ చౌదురికి కూడా ఆహ్వానాలు అందాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News