Tuesday, April 30, 2024

రాజ్యసభ ఎంపి సంతోష్ కు ప్రధాని లేఖ

- Advertisement -
- Advertisement -

Prime Minister Modi letter to Rajya Sabha MP Santosh

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ కు ప్రధాని నరేంద్ర మోడీ లేఖ రాశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వృక్షవేదం పుస్తకంపై ప్రశంసలు కురిపించారు. పచ్చదనం పెంపు దిశగా యువతకు మార్గనిర్దేశం చేస్తున్నారని వెల్లడించారు. ప్రకృతితో మనిషికున్న అనుబంధం తెలిపే పుస్తకం.. వృక్షవేదం అని ప్రధాని తెలిపారు. వృక్షవేదం పుస్తకం అందరూ చదవాలి, ప్రేరణ పొందాని మోడీ పిలుపునిచ్చారు. ప్రకృతిపరంగా గొప్ప వారసత్వాన్ని రక్షించుకునేందుకు కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రధానికి ఎంపి సంతోష్ కుమార్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మరింత ముందుకు తీసుకెళ్తానని ప్రకటించారు. దీంతో ఎంపి సంతోష్ కష్టానికి ఫలితం దక్కినట్టు తెలుస్తుంది. ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో చేస్తున్న బృహత్కర కార్యక్రమానికి తెలుగురాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల నుంచి భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలోని చాలామంది ప్రముఖులు, కళాకారులు, క్రీడారంగ ప్రముఖులు, రాజకీయ నేతలు ఎంపి సంతోష్ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి ఇదే ఛాలెంజ్ ను మరొకరికి విసురుతున్నారు.

Prime Minister Modi letter to Rajya Sabha MP Santosh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News