- Advertisement -
మహబూబ్ నగర్: ఉమ్మడి పాలమూరు జిల్లాకు వర ప్రదాయినిగా ఉన్న ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వరద నీటితో జలకళ సంతరించుకుంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కృష్ణానదికి వరదలు వస్తున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములు నిండడంతో అక్కడి నుంచి జూరాలకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టులో భారీగా వరద నీరు చేరడంతో అధికారులు 10 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు.
- Advertisement -