Friday, May 3, 2024

సిఎఎకి వ్యతిరేకంగా ఆందోళన.. ఆందోళనకారుల రాళ్లదాడిలో పోలీసు మృతి

- Advertisement -
- Advertisement -

CAA

 

న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం ఘర్షణలు చెలరేగాయి. సిఎఎకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులకు, ఈ చట్టానికి అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నవారికి మధ్య ఘర్షణలు రేగడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జఫ్రాబాద్..మౌజ్ పూర్, గోకుల్ పురి వంటి ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో ఓ పోలీసు మరణించాడు. గోకుల్ పురిలో ఆందోళనకారులు జరిపిన రాళ్ళ దాడిలో గాయపడి మృతి చెందిన ఇతడిని రతన్ లాల్ అనే హెడ్ కానిస్టేబుల్ గా గుర్తించారు. మరికొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. ఆందోళనకారులు పలు వాహనాలకు, షాపులు, ఇళ్లకు నిప్పు పెట్టారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి బాష్పవాయువు ప్రయోగించారు. జఫ్రాబాద్-మౌజ్ పూర్ రోడ్డులో ఒక యువకుడు పోలీసులపై నాటు తుపాకీతో 8 రౌండ్ల కాల్పులు జరిపాడు. అతి కష్టం మీద పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

 

Protest against the CAA in Delhi
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News