- Advertisement -
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పురులియా జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బలరామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నమ్ షోల్ శివారులో జాతీయ రహదారి 18పై లారీని బొలెరో వాహనం ఢీకొనడంతో 9 మంది మృతి చెందార. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఝార్ఖండ్ రాష్ట్రం నిమ్ధిహ పోలీస్ స్టేషన్ పరిధిలో టిలైటాండ్ గ్రామంలోని పెళ్లి వేడుకకు వెళ్లి వస్తుండగా ఈప్రమాదం జరిగింది. మృతుల స్వస్థలం పురులియా జిల్లాలోని అదాబానా గ్రామంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
- Advertisement -