Thursday, May 2, 2024

సివిల్స్ విజేతలను సన్మానించిన రాచకొండ సిపి

- Advertisement -
- Advertisement -

Rachakonda CP honored Civils winners

 

మనతెలంగాణ, హైదరాబాద్: ఇటీవల విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో విజయం సాధించిన వారిని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సన్మానించారు. సివిల్స్‌లో 20 ర్యాంక్ సాధించిన పి. శ్రీజ, 218వ ర్యాంక్ సాధించిన కనకనాల రాహుల్, 318 ర్యాంకర్ పూజారే గౌతమి నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం సిపి మహేష్ భగవత్‌ను కలిశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న వారి కోసం సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేశారు. 2014లో ఏర్పాటు చేసిన ఈ గ్రూపులో చేరిన వారిలో 10వేల మంది విధ్యార్థులు విజయం సాధించారు. ఈ ఏడాది రాచకొండ సిపి మహేష్ భగవత్ వాట్సాప్ గ్రూపులో చేరిన 135మంది విజయం సాధించారు. ఇందులో 20మంది టాప్ 100 ర్యాంకర్లలో ఉన్నారు. సివిల్స్‌కు ఎంపికైన వారు కష్టపడి పనిచేయాలని, ప్రజలకు మంచి పాలన అందించాలని సిపి మహేష్ భగవత్ కోరారు. కార్యక్రమంలో విజయం సాధించిన అభ్యర్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News