Sunday, April 28, 2024

శివసేనరెడ్డిని పరామర్శించిన రాహుల్‌గాంధీ

- Advertisement -
- Advertisement -

Rahul Gandhi Consulted Shiv Sena Reddy

హైదరాబాద్:  తెలంగాణ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనరెడ్డిని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు, పెగాసస్ స్పైవేర్ గూఢచర్యం, రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆగస్టు 5న ఢిల్లీలో నిర్వహించిన పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో శివసేనరెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులకు, యువజన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మధ్య జరిగిన తోపులాటలో అనేకమంది గాయాలపాలయ్యారు. అదే సందర్భంలో శివసేనరెడ్డి మోకాలు ఫ్రాక్చర్ అయింది.

వెంటనే అక్కడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. మోకాలు ఫ్రాక్చర్ అవడంతో సిమెంట్ పట్టీ వేశారు. అదే మీటింగ్‌కు వచ్చిన రాహుల్‌గాంధీ తాను ప్రసంగించేటప్పుడు పక్కనే ఉన్న శివసేనకు కాలి దెబ్బ తగిలింది తెలిసి వెంటనే వచ్చి పరామర్శించారు. యువజన కాంగ్రెస్ జాతీయ బాద్యులు కృష్ణ అల్లవారు దెబ్బతగిలిన తీరును రాహుల్‌గాంధీకి వివరించగా రాహుల్‌గాంధీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. అండగా ఉంటానని శివసేనరెడ్డికి మాటిచ్చిన రాహుల్‌గాంధీ వెంటనే యువజన జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు బివి శ్రీనివాస్‌ని తన పిఎ అలంకార్‌ని పిలిచి చికిత్సకయ్యే పూర్తి బాధ్యత తీసుకోమని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News